జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని 7 జాతీయ ఉత్తమ అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన మూడు కేటగిరీల్లోనూ అవార్డులు రాగా, అవన్నీ జనరల్ విభాగంలోనే రావడం మన రాష్ట్ర ప్రతిభకు నిదర్శనం అన్నారు. ఈ అవార్డులు సీఎం కేసీఆర్ దార్శనికతకు, ప్రగతికాముక నిబద్ధతకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు. ఆయా జిల్లా/మండలం/గ్రామ పంచాయతీలు అభివృద్ధి సాధించడానికి అన్ని విధాలుగా స్ఫూర్తిగా నిలిచిన సిఎం కెసిఆర్ కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
అలాగే, ఉత్తమ అవార్డులు పొందిన జిల్లా/మండలం/ గ్రామ పంచాయతీలకు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్ఫూర్తి కొనసాగాలని, వచ్చే ఏడాది మరిన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు ఈ అవార్డులకు పోటీ పడాలని, మరిన్ని అవార్డులు దక్కాలని ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి పరిపాలనకు నిదర్శనంగా రాష్ట్ర పంచాయతీరాజ్శాఖకు 7జాతీయస్థాయి ఉత్తమ అవార్డులు రావడం గమనార్హం. మూడు కేటగిరీల్లోనూ జనరల్ కోటాలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధూమ్ దామ్ కొనసాగింది. కేంద్రం ప్రకటించిన అన్ని కేటగిరీల్లోనూ తెలంగాణ హవా కొనసాగింది.
కాగా, ఈ వార్డులు సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏటా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రకటించే దీన్ దయాల్ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాలలో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి వివిధ కేటగిరీల్లో ఏడు అవార్డులు దక్కాయి. ఏడు అవార్డులూ జనరల్ కేటగిరీలోనే రావడం విశేషం. జిల్లా, బ్లాక్/మండలం, గ్రామ పంచాయతీల వారీగా ఈ అవార్డులను ప్రకటించారు. కేటగిరీల వారీగా మొదటి కేటగిరీలో నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్ గా, రెండో కేటగిరీలో గ్రామ పంచాయతీ డెవలప్ మెంట్ ప్లాన్ అవార్డు, మూడో కేటగిరీలో చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ అవార్డుల పేరుతో ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. మంగళవారం రాత్రి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సంజీబ్ పత్ జోషీ ఈ అవార్డులను ప్రకటించారు.