వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పగలిగే నాయకుడు  విజయసాయిరెడ్డి. కొద్దిరోజులుగా ఆయన కాస్త సైలెంట్ అయినట్టుగా కనిపించారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యం పెరిగింది అని, జగన్ vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి ని పక్కన పెట్టినట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ తరువాత కొద్ది రోజులకే ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను జగన్ vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి చేతిలో పెట్టారు. అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల బాధ్యతను తీసుకున్నారు. మొదటి నుంచి అక్కడ రాజకీయ వ్యవహారాలను పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకొన్నారు. అసమ్మతి నేతలను, తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపైన, అలాగే పార్టీకి నష్టం చేకూర్చే వారిపైన విజయసాయిరెడ్డి పూర్తిగా దృష్టి పెట్టి పార్టీ వ్యవహారాలు పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకోగలిగారు.


విజయ సాయి రెడ్డి చర్యలతో సొంత పార్టీ నాయకులు కూడా ఇప్పుడు క్రమశిక్షణతో మెలుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా భూ కబ్జా ఆరోపణలపై పార్టీ నేత కొయ్య ప్రసాదరెడ్డి ని వైసిపి సస్పెండ్ చేసింది. vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి సూచనతోనే జగన్ కొయ్య ప్రసాద్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేయడంతో, ఎవరూ దీనిపై స్పందించ లేని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారం ద్వారా vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గ లేదనే విషయాన్ని నిరూపించుకున్నారు. అలాగే వైసీపీలో చేరేందుకు కొద్దికాలంగా గట్టి ప్రయత్నాలు చేస్తూ వస్తున్న మాజీమంత్రి, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు కూడా చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది.


గంటా శ్రీనివాసరావు మేనల్లుడు భూ కబ్జా వ్యవహారాలను బయటకు తవ్వి తీయడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. దీని ద్వారా తనకు వ్యతిరేఖంగా గళం విప్పుతున్నవారు ఎంతటి వారైనా, ఇదే పరిస్థితి తలెత్తుతుందనే విషయాన్ని విజయసాయిరెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. అలాగే జగన్ దగ్గర తన పరపతి తగ్గలేదని విషయాన్ని మరోసారి విజయసాయిరెడ్డి నిరూపించుకున్నట్టుగా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: