కరోనా  వైరస్ కారణంగా జనజీవనం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. మనిషి జీవన శైలిని మొత్తం అతలాకుతలం చేసింది ఈ మహమ్మారి. శరవేగంగా వ్యాప్తిచెందుతూ  ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు... ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా  చేసింది . అయితే కేవలం మనిషి ప్రాణాలమీదికి తీసుకు రావడమే కాదు మనిషి ఆర్థికంగా మానసికంగా కూడా దెబ్బ తీసిన విషయం తెలిసిందే. వైరస్ కారణంగా  ఉపాధి కోల్పోయి  ఎన్నో  కుటుంబాలు రోడ్డున పడితే మరికొంత మంది ఉద్యోగాలు కోల్పోయి అయోమయం లో పడ్డారు. దీంతో కరోనా  సంక్షోభం సమయం లో ఆర్థికంగా అందరూ తీవ్ర ఇబ్బందు ల్లో  కూరుకుపోయారు.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ మేలు జరిగే విధంగా సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి లాక్డౌన్ విధించిన నాటినుంచి... ఎంతో మంది ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు నుంచి ఎలాంటి ఈ ఎమ్ ఐ లు వసూలు చేయవద్దు అంటూ మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఎంతో మందికి మేలు జరిగింది.




 కాగా ఈ మారటోరియం ని కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ పొడిగిస్తూ వచ్చింది. ఆర్థికంగా కుదేలైన వారందరూ కాస్త కోలుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి నుంచి ఆగస్టు వరకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి ఈఎమ్ఐ వసూలు చేయవద్దు అంటూ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఆర్బిఐ విధించిన మారటోరియం ఇక ఈ రోజుతో ముగియనుంది. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో మరోసారి మారటోరియం పొడిగించే అవకాశాలు మాత్రం లేవు. దీంతో రుణాలు తీసుకున్నవారు వడ్డీలతో సహా వచ్చే నెల నుంచి రుణాలు చెల్లించక తప్పదు. ఈ నేపథ్యంలో అందరూ ప్రజలు సిద్ధమైపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: