ఇలా ప్రతి విషయం లో కూడా చైనా తో ఏర్పడిన వివాదం భారత్కు మంచి జరుగుతూ నే ఉంది. భారత ఆయుధ కర్మాగారాన్ని భారత్ రోజు రోజుకీ మరింత పటిష్టంగా మార్చు కుంటున్న విషయం తెలిసిందే. భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో ఎప్పటికప్పుడు సరికొత్త క్షిపణుల ను మిస్సైల్ ను తయారు చేసి ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్య పరుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధునాతన టెక్నాలజీ మిస్సైల్స్ క్షిపణుల ను తయారుచేసింది డి ఆర్ డి ఓ. అంతే కాకుండా శరవేగంగా ప్రయోగాలు నిర్వహిస్తూ ప్రస్తుతం భారత అమ్ములపొదిలో చేర్చుతుంది.
ఇక ఇప్పుడు మరో అద్భుతమైన ఆయుధాన్ని కూడా డి ఆర్ డి ఓ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్యా అమెరికా లాంటి దేశాల క్షిపణులతో పోటీపడేటువంటి అధునాతన టెక్నాలజీతో కూడిన క్షిపణులను భారత్ సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే..కాగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి హైపర్ సోనిక్ క్రూయల్ క్షిపణులు కలిగి ఉన్నటువంటి దేశం కింద భారత్ కూడా మారిపోతుంది అని డిఆర్డిఓ తెలిపింది. రక్షణ రంగంలో అమెరికా కంటే ఎంతో పటిష్టం గా మారుస్తామని దీని అర్థం. ప్రస్తుతం ఇది భారత ప్రజలందరికీ ఒక శుభవార్త అని చెప్పాలి.