మిగితా వ్యవహారాలలో కూడా జగన్ ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు.. ఎక్కడా ప్రతిపక్షాల విమర్శలకు తావు ఇవ్వకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ అన్ని పనులు చేసుకుపోతున్నాడు.. ఓ వైపు టీడీపీ జగన్ ఏం చేసినా తప్పుబడుతుంది టీడీపీ పార్టీ.. ముఖ్యంగా చంద్రబాబు తాను చేసిన తప్పుడు పనులను జగన్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు.. ఇక ఇటీవలే జగన్ జైలుకి వెళ్లడం ఖాయం, ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో నిజ నిర్ధారణ ఎంతో దగ్గరుంది విమర్శలు చేస్తున్నారు..
ఇక ఆయన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఆరోపణలు చేశారని. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి మరీ రచ్చ చేశారని. జగన్ పదవి క్రిస్మస్ నాటికల్లా పోతుందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పేసారు. అపుడే తాను ఏపీకి వస్తాను అంటున్నారు. ఇక విశాఖ ఆక్టోపస్ సబ్బం హరి కూడా జగన్ సీఎం గా ఎక్కువ రోజులు ఉండరని అంటున్నారు. ఇవి వైసీపీలో పెద్ద ఎత్తున అలజడిని రేకెత్తిస్తున్నాయి.ఈ కీలకమైన సమయంలో కేంద్రంలో అగ్ర స్థానంలో ఉన్న మోడీ, అమిత్ షాల మీదనే అందరి దృష్టి ఉంది. జగన్ ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్తు ప్రధాన న్యాయమూర్తి చేతిలో బంతి ఉంది. అదే సమయంలో కేంద్రంలోని ప్రభుత్వం కూడా ఇపుడు చాలా ముఖ్యమైన పాత్ర వహించాలి. కేంద్రం చొరవ తీసుకుంటేనే ఈ వివాదానికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుంది అని అంటున్నారు.