మేం పుట్టి పెరిగిన హైద్రాబాద్ లో మీకేం పని అని నిలదీశారు. కాంగ్రెస్ ను చూస్తే బాదేస్తుంది, నవ్వొస్తోంది అని ఎద్దేవా చేసారు. ఆరోగ్య శ్రీ ని కరోనా లో ఎలా చేరుస్తారు అని ప్రశ్నించారు. బయట నవ్వుకుంటున్నట్లే కాంగ్రెస్ బ్రతుకుంది అన్నారు. మెట్రో కు, విద్యుత్ బిల్లులకు జిహెచ్ఎంసి కి ఏం సంబంధం అని నిలదీశారు. కిషన్ రెడ్డి కేంద్రం నిధులతో ఒక్క పనైనా చేపించిండా అని నిలదీశారు. 25వేలు ఇస్తామని కేంద్రం తో జీవో విడుదల చేపించండి అని ఆయన సవాల్ చేసారు. దేశంలో భాగమైన హైద్రాబాద్ లో సర్జికల్ స్ట్రైక్ చేస్తారా అని నిలదీశారు.
బండి సంజయ్ కి హైద్రాబాద్ గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. దమ్ముంటే విరోధులు అనుకునే వారిని దేశ బహిష్కరణ చేయండి అని ఆయన సవాల్ చేసారు. కేసీఆర్ మీద మదం పట్టి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ఏం భాష మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. ఎంఐఎం వారు కూడా ప్రభుత్వాన్ని పడేస్తాం అంటున్నారు అని విమర్శించారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అన్నారు. ఎంఐఎం బలం ఎంత వారి ఓట్లు ఎన్ని, పరిధి ఎంత? అని ఆయన ఎద్దేవా చేసారు. మేం ఆషామాషీగా ఉన్నామా? ఎంఐఎం వాళ్ల బలం తెలుసుకుని మాట్లాడాలి అని హితవు పలికారు.