తెరాస ప్రభుత్వ విధానాలపై, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తీరుపై  బిజెపి నేత విజయశాంతి తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను  ఎండగడుతూ విరుచుకుపడ్డారు. కెసిఆర్ సభలు సమావేశాల్లో మాట్లాడే పిచ్చి  మాటలు చూస్తే  ఆయన మెదడు కరాబ్ అయిందా అన్నట్లు కాపాడుతుందని ఆమె అన్నారు.  ఆయన మానసిక స్థితి లోపించడం వల్లనే ఇలా చేస్తున్నారా అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే కొడుకు ను ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతో పిచ్చి లేచినట్టు వ్యవహరిస్తున్నారా అని అనుకోవచ్చు అని కామెంట్ ద్వారా తెలియజేశారు. గతంలో కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని  అనుకున్న సమయంలో  తీవ్రంగా వ్యతిరేకత వచ్చిందని, అందుకనే ఈ రకమైన వింత ప్రవర్తన విన్యాసాలు చేస్తున్నాడు అని, ఈ విధంగా చేస్తే నేతలంతా కెసిఆర్ మానసికంగా బాగోలేదని అనుకున్నప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన వారి నుంచి పుట్టేట్టు చేస్తున్నారా అని ఆమె అన్నారు.

 ఏమీ అభివృద్ధి కాకపోయినా  అరచేతిలో స్వర్గం చూపిస్తూ  ముఖ్యమంత్రుల్లో టాప్ ర్యాంక్  ఎవరికి ఇవ్వాలంటే దానికి అన్ని అర్హతలు కలిగిన ఏకైక వ్యక్తి  ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే.. అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆమె తెలిపారు. ఒక పక్క బడ్జెట్ అంతా ఖాళీ అయిన, గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయినా, ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు అమలు చేయలేక పోతున్నా, కొత్త పథకాల పేరుతో ప్రజల నోట్లో మన్ను కొడుతూ మాయ మాటలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు అని, గుప్పిట్లోనే వైకుంఠాన్ని చూపిస్తున్నారని విజయశాంతి తెలిపారు.

రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిని  మనం గమనిస్తే ప్రభుత్వ పథకాల కోసం పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు  వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రైతులకు ఇప్పటి వరకు లక్ష లోపు రుణమాఫీ చేయలేదని, ప్రాజెక్టులు నిర్మిస్తూ  నిర్వాసిత రైతులకు కనీసం పరిహారం అందించలేదని, నాసిరకం డబల్ బెడ్ రూమ్ నిర్మించి ఇచ్చాడని ఈ విధంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని తెలిపారు. ధనిక రాష్ట్రమని చెప్పి  తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పగా తయారు చేశాడని, ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేరలేదని తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని విజయశాంతి తీవ్రంగా విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: