ఇక పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద ఏడాదికి మూడు విడతల్లో రూ. 2000 వేల చొప్పున రూ.6000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్రం 11వ విడత కూడా నిధులు విడుదల చేయడం జరిగింది.అయితే కొంత మంది రైతులకు మాత్రం ఈ డబ్బులు రాలేదు.ఇక దీనికి కారణం ఏంటంటే వారు అసలు ఈ కేవైసీ అనేది చేసుకోకపోవడమే.. మరి ఇక ఇప్పుడు వారు ఏం చేయాలంటే.. వెంటనే ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. ఈ  ప్రాసెస్ అనేది కేవలం నిమిషాల్లో పూర్తవుతుంది. ఈకేవైసీని స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఈజీగా చెయ్యొచ్చు కానీ మీ ఆధార్‌ మొబైల్‌ నెంబర్‌కు ఖచ్చితంగా లింక్‌ అయి ఉండాలి. మీ మొబైల్‌ నెంబర్‌ ఆధార్‌ నెంబర్ కు కనుక లింక్‌ అయ్యి లేకుంటే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న మీసేవలోకి వెళ్లి మీ ఆధార్‌ నెంబర్ తో ఫోన్‌ నెంబర్‌ను లింక్‌ చేయించుకోవాలి. ఇక ఆ తర్వాత ఈకేవైసీని పూర్తి చేసుకోవాలి.ఇక ఇప్పటికే ఆధార్‌తో ఫోన్‌ నెంబర్‌ లింక్‌ అయినవారు వారి స్మార్ట్‌ఫోన్‌లో https://pmkisan.gov.in/NewHome3.aspx సైట్‌లోకి వెళ్లాలి. వెళ్లిన తరువాత అందులో ఫార్మర్‌ కార్నర్‌ అని ఉంటుంది.


అందులో మొదటి ఆప్షన్‌ ఈకేవైసీ అని ఉంటుంది. ఆ తర్వాత ఆన్‌లైన్‌ రీఫండ్‌ ఇంకా అలాగే న్యూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్ ఇంకా ఎడిట్‌ ఆధార్‌ డిటైల్స్‌ ఇంకా బెనిఫిషరీ స్టేటస్‌ ఇంకా రిజిస్ట్రేషన్‌ స్టేటస్‌ ఇంకా అలాగే బెనిఫిషరీ లిస్ట్‌ ఉంటుంది. ఇందులో ఈ కేవైసీ ఆప్షన్‌పై కూడా మీరు క్లిక్ చేయాలి. ఇక అక్కడ మీ ఆధార్‌ నంబర్ ని అడుగుతుంది. మీ ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత లింక్‌ అయిన్‌ మీ మొబైల్ ఫోన్‌ నెంబర్ అడుగుతుంది.మొబైల్ ఫోన్‌ నెంబర్‌ నమోదు చేయగానే నాలుగు అంకెల ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత ఆధార్‌ వెరిఫికేషన్‌ ఓటీపీ కూడా వస్తుంది. ఇక ఈ ఓటీపీ అయితే 6 అంకెలు ఉంటుంది. ఈ ఓటీపీ ఎంటర్‌ చేసి సడ్మిట్‌ చేయగానే సక్సెస్‌ఫుల్‌ ఈకేవైసీ అని వస్తుంది. దీంతో మీ ప్రాసెస్‌ అనేది పూర్తవుతుంది. మొబైల్ నెంబర్ లింక్‌ కానివారు మీసేవకు వెళ్లి మీ బయోమెట్రిక్‌ ఇచ్చి ఫోన్‌ నెంబర్‌ ని లింక్ చేయించాలి. ఇక ఆ తర్వాత పైన ఉన్న ప్రాసెస్‌ ప్రకారం ఈకేవైసీ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: