నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలైంది..దాంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు జల దిగ్బందములొ మునిగిపొయాయి. ఆయా ప్రభుత్వాలు సహాయ చర్యలు చేపట్టినా కూడా ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇక అస్సాం పరిస్థితి వర్ణనాతీతం.. దారుణంగా మారింది.వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
 

ఇళ్లల్లోకి వరద నీరు భారీగా వస్తుండడంతో అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు కనీసం తాగడానికి నీరు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో కడుపుతో ఉన్న భార్యను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ముఖ్యమంత్రికి మెయిల్ చేశాడు. ''దయచేసి 9నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి'' అంటూ వేడుకున్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో చివరకు ఏం జరిగిందంటే..


అస్సాం రాష్ట్రం సిల్చార్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బరాక్ నది వెంబడి ఉన్న బేతుకండి కరకట్ట వద్ద తెగిపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. రాత్రికి రాత్రే పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రంగీర్‌ఖారీ కనక్‌పూర్ రోడ్ రాధామాధవ్ బునియాడి పాఠశాల స్కూల్ సమీప ప్రాంతంలో వరద నీరు ముంచెత్తింది. ఈ ప్రాంతంలో ఉంటున్న నిరుపమ్ దత్తా పురక్యస్థ అనే వ్యక్తి భార్య 9నెలల గర్భంతో ఉంది. వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కడుపుతో ఉన్న భార్యను రక్షించేందుకు నిరుపమ్ ఎన్నో రకాలుగా ఆలోచించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలీక చివరికి.. జూన్ 21 ఉదయం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈమెయిల్ చేశాడు.


అందుకు స్పందించిన ప్రభుత్వం అతడికీ సాయం అందించాలని ముందుకు వచ్చింది. అందుకోసం ఆమెను పడవలో సురక్షిత ప్రదేశానికి తరలించారు. వరదల కారణంలో కొండచరియలు విరిగిపడడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాగే ఎస్‌డిఆర్‌ఎఫ్, పారా మిలటరీ, ఇతర భద్రతా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: