
ఓకే దేశం ఓకే ఎన్నిక అనే భావన పైన వస్తున్న రూమర్స్ పైన రాబోయే ఎన్నికలలో ఇది అమలు చేయడం సాధ్యం కాదంటూ తెలిపారు ఆర్థిక వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్.. ఒక సభలో మాట్లాడుతూ 2024 లోక్సభ ఎన్నికలలో సుమారుగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని ఒకేసారి ఎన్నికల నిర్వహించడం వల్ల వీటన్నిటిని ఆదా చేయవచ్చు అంటూ వెల్లడించారు.. ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే GDP దాదాపుగా 1.5 శాతం వరకు వృద్ధి చెందుతుందంటూ తెలియజేశారు. కొన్ని పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నిక పైన కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని వాటిని ఎవరు నమ్మకండి అంటూ తెలిపింది.
2034 తరువాత ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ తెలిపింది నిర్మల సీతారామన్.. అప్పటి రాష్ట్రపతి ఆమోదం కోసమే ఇప్పుడు పునాదులు వేస్తున్నామంటూ తెలియ చేశారు. అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది 1960 నుంచి ఇది ఉనికిలో ఉన్నదని దీన్ని ప్రయోజనాన్ని పరిగణంలోకి తీసుకుని మద్దతు ఇస్తే ఒకే దేశం ఒకే ఎన్నికల మారుతుందని కేంద్రమంత్రి తెలిపారు. దివంగత డీఎంకే నేత ఎం.కరుణానిధి ఇందుకు మద్దతు ఇచ్చారని కానీ ఇప్పుడు ఆయన కుమారుడు ఎం.కె స్టాలిన్ మాత్రం తన తండ్రి అడుగుజాడలలో నడవలేదని వెల్లడించారు సీతారామన్. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో జెమిలీ ఎన్నికలు సాధ్యం కావాలంటూ తెలియజేసినట్టు కనిపిస్తోంది