ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండగా కొంతమంది కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పని చేయడానికే ఆసక్తి చూపుతారు. ఎమ్మెల్యేల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఇబ్బంద్లు పడాల్సి వస్తుందని భావిస్తారు.
 
అయితే మరీ ఒత్తిడి ఎక్కువైతే మాత్రం ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు సైతం ప్రభుత్వంను ఎదురించడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పవచ్చు. వైసీపీ పాలన సమయంలో ఉద్యోగ సంఘాలు కొంతమేర పోరాటం సాగించాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మాత్రం ఉద్యోగ సంఘాలు సర్దుకుపోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.
 
ఇప్పుడు మాత్రం ఆ లెక్కలు మారుతున్నాయి. ఇప్పుడు ఉద్యోగులు తిరగబడుతుండటం సంచలనం అవుతోంది. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మీద మహిళా తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యే తనకు వాట్సాప్ కాల్ చేసి బూతులు తిట్టారంటూ మహిళా అధికారి ఆరోపణలు చేయడం గమనార్హం.
 
తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేయడం వల్లే సదరు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారనే చర్చ జరుగుతోంది. వాట్సాప్ కాల్ బట్టి ఆధారాలు చూపించే విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ వివాదం విషయంలో కూటమి సర్కార్ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.





వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: