కాన్పూర్‌లోని చౌబేపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ డాబా రామయ్య హోటల్‌లో ఇటీవల ఒక భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పరోటాలకు పేరుగాంచిన ఈ హోటల్‌కు రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి వచ్చాడు. వారు పరోటాలను ఆర్డర్ చేయగా, వాటిలో ఒక పరోటాలో చనిపోయిన బల్లి కనిపించింది. దీనిని చూసిన కస్టమర్ వెంటనే తీవ్ర భయాందోళనకు గురై వాంతులు చేసుకున్నాడు. ఈ ఘటనతో హోటల్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఈ సంఘటన హోటల్ ఫుడ్ విషయంలో ప్రజలలో ఉన్న ఆందోళనలను మరోసారి పెంచింది. నాణ్యత, పరిశుభ్రత విషయంలో హోటళ్ళు ఎంత అశ్రద్ధగా వ్యవహరిస్తున్నాయో ఈ ఉదంతం నిరూపిస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి హోటళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్థానిక అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

హోటళ్లలో తరచూ ఆర్డర్ చేసుకుని ఫుడ్ తినేవాళ్లు సైతం తీసుకునే ఆహరం నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. పరోటాలను మైదా పిండితో తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. మైదాతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి సైతం తీవ్రస్థాయిలో నష్టం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. ఈ ఘటనతో బయట ఫుడ్ తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని కచ్చితంగా చెప్పవచ్చు. విషపూరితమైన ఆహరం తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో సైతం ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చని చెప్పవచ్చు. 


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: