
సాధారణంగా పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి, ముఖ్యంగా జగన్కు అద్భుతమైన అభిమాన వాతావరణం ఉంటుందని అందరికీ తెలుసు. అలాంటప్పుడు అవినాష్ రెడ్డి ఇలా కంగారు పడటం వెనక అసలు కారణం ఏమిటి? రాజకీయ విశ్లేషకుల మాటలో చెప్పాలంటే – ఈ నిర్ణయం ద్వారా అవినాష్ రెడ్డి, తమకే ఓటు వేయనని అనుకున్న ప్రజలను తప్పుపట్టినట్లే అయ్యింది. రిగ్గింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం వల్లనే ఇంత కోపం చూపిస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇంకా సీరియస్గా చూడాలి అంటే – రేపు కౌంటింగ్ ఫలితాల్లో ఈ రెండు బూత్లే అసలు గేమ్చేంజర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, ఈ బూత్ల్లో కలిపి కనీసం 1200 ఓట్లు ఉన్నాయి. మొత్తం పోలింగ్ 15 బూత్ల్లోనే జరిగి ఉండటంతో, ఈ రెండు బూత్ల ప్రభావం నిర్ణాయకంగా మారొచ్చు.
ఒకవేళ ఈ రెండు బూత్ల ఓట్ల తేడా వల్లే జడ్పీటీసీ ఫలితం తిరగబడితే? అవినాష్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారు? ముఖ్యంగా 100-200 ఓట్ల తేడాతో ఓడిపోతే అది నేరుగా ఆయన రాజకీయ పరువుకు గట్టి దెబ్బ అవుతుంది. అసలైన సమస్య ఏమిటంటే – వైసీపీకి పులివెందులలో బలమైన క్యాడర్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు పోరాడాలి గానీ, మధ్యలో బహిష్కరణ ప్రకటించడం అంటే, ఫైటర్ ఇమేజ్కి నష్టం. అంతేకాదు, ఈ రెండు బూత్లలో కనీసం సగం ఓట్లు తనవైపు వస్తాయని అనుకున్నా, రేపు కౌంటింగ్లో ఆ ఓట్లు లేకపోవడం వల్లే ఓటమి వస్తే… రాజకీయంగా మాత్రమే కాకుండా, ఇమేజ్ పరంగా కూడా అవినాష్ రెడ్డి బలమైన దెబ్బ తినాల్సి వస్తుంది. ఇక మిగిలింది ఒక్కటే – రేపటి ఫలితాలు. అవి ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తాయా? లేక పరువు గంగలో కలిపేస్తాయా? అన్నది చూడాలి.