
ఈ క్రమంలోనే ఆమె భర్త మదన్ ఒక సంచలన ఆరోపణ చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య శాంతి బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డి అని ఆయన ఆరోపించడం పెద్ద కలకలం రేపింది. శాంతి మాత్రం ఆసుపత్రి రికార్డుల్లో ఒక లాయర్ పేరును బిడ్డ తండ్రిగా నమోదు చేసింది. దీనిపై మదన్ డీఎన్ఏ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చి, శాంతిని తాను ఒక కూతురిలా ఆదరించానని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారాలన్నింటితో శాంతి మరింతగా వార్తల్లోకి ఎక్కారు. ప్రభుత్వానికి రాంగ్ సమాచారం ఇవ్వడం, వ్యక్తిగతంగాను వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు ఆమె సస్పెన్షన్లో ఉన్నా ఆమె లైఫ్స్టైల్ చాలా లగ్జరీగా కొనసాగుతోందని దేవాదాయశాఖా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ప్రస్తుతం శాంతిపై అన్ని అభియోగాలు నిర్ధారణ కావడంతో, ఉద్యోగం నుంచి తొలగించాలనే నిర్ణయం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకప్పుడు కీలక అధికారిగా వ్యవహరించిన శాంతి ఇప్పుడు అవినీతి, వ్యక్తిగత వివాదాల ముద్రతో ఉద్యోగం కోల్పోవడం ఖాయమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.