ఎంతోమంది భక్తులు ప్రతి రోజు దేవుడిని పూజిస్తూ ఉంటారు కానీ ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి.. అలా పుజించడం వల్ల ఫలితం ఏంటి అనేది ఎందరో భక్తులకు తెలియదు. అయితే ఆ భక్తులు అంత కూడా ఏ రోజు ఏ దేవుకు పూజిస్తే మంచిది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో ఏరోజు ఏ దేవుడుకు పూజ చెయ్యాలి అనేదానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. 

 

సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైంది. మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు పూజలుచెయ్యాల్సి ఉంటుంది.

 

సోమవారం.. సంపద కోరుకోనేవారు సోమవారం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి. ఇలా చెయ్యటం వల్ల సంపద పెరుగుతుంది.  

 

మంగళవారం.. రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాల్సిఉంటుంది. 

 

బుధవారం... పెరుగు అన్నాన్ని బుధవారం విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది.

 

గురువారం.. ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు గురువారం తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మంచిది. 

 

శుక్రవారం.. ఇష్టదైవాన్ని శ్రద్ధతో శుక్రవారం ఆరాధిస్తే భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. 

 

శనివారం... శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

 

ఆదివారం.. ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర సమస్యలు, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి.  

 

ఇలా వారంలో ఏడు రోజులలో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేది శివుడేనని శివపురాణం చెప్తుంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భవిస్తాడని, ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు అని శివపురాణం చెబుతుంది. ఆందుకే ఈ వారాలలో దేవుడికి పూజలు చేసి ఆరోగ్యాన్ని, సంపదను, దేవుడి ఆగ్రహం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: