అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్క మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం అదే ఫామ్ కొనసాగించ లేక చివరికి విమర్శలు ఎదుర్కొంటు వచ్చాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ కి భారత జట్టులో స్థానం ఇవ్వడమే వృధా అన్నట్లుగా విమర్శలు కూడా వచ్చాయి. కాగా తనపై వస్తున్న విమర్శలకి తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు రిషబ్ పంత్. వరుసగా రెండు ఇన్నింగ్స్ లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించాడు రిషబ్ పంత్.
ఇటీవలే నాలుగవ ఇన్నింగ్స్ లో భాగంగా భారత్ గెలవడానికి రిషబ్ పంత్ చేసిన గౌరవప్రదమైన పరుగులే కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తాజాగా టీమిండియా విజయం సాధించడం పై స్పందించిన రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. గబ్బ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించడం తన జీవితంలో మరిచిపోలేని రోజు అంటూ వ్యాఖ్యానించాడు. ఈ విజయంలో తన వంతు పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఫామ్ లో లేని సమయంలో కూడా టీమిండియా యాజమాన్యం తనను ప్రోత్సహిస్తుందని.. ప్రస్తుతం వారి నమ్మకాన్ని నిలబెట్టా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విజయంతో తన కల నెరవేరింది అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్.