టీమిండియా టెస్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నా అని ప్రకటించిన నాటి నుంచి ఒకటే చర్చ జరుగుతోంది. విరాట్ కోహ్లీ తర్వాత భారత టెస్ట్ కెప్టెన్సీ చేపట్టబోయే ది ఎవరు అని. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న అనుభవం సీనియార్టీ ప్రకారం చూస్తే అటు విరాట్ కోహ్లీ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు కూడా చేపట్టాల్సి ఉంది. కానీ రోహిత్ శర్మ ఎంపికపై మాత్రం గత కొన్ని రోజుల నుండి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ వ్యూహాల పరంగా సమర్ధుడు అయినప్పటికీ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ లో రాణించాలంటే ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మాజీ ఆటగాళ్లు.



 తరచూ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఉండే రోహిత్ శర్మను కాకుండా విరాట్ కోహ్లీ లాగా ఫిట్గా ఉండే యువ ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం దృష్ట్యా రోహిత్ శర్మ కెప్టెన్సీకి సమర్ధుడు అయినప్పటికీ వయసు దృశ్య మాత్రం రోహిత్ శర్మ సరైన ఆప్షన్ కాదేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే టీమిండియా మాజీ వికెట్కీపర్ నబా కరీం  కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రోహిత్ శర్మ తన ప్రదర్శనతో గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు భారత జట్టుకు ప్రధాన బలం కూడా అతడు.. అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ ముందు ఉన్న అసలైన సవాల్ కెప్టెన్సీ కాదు అతడు మూడు ఫార్మాట్లకు ఫిట్ గా అందుబాటులో ఉంటాడా లేదా అన్నది. ఇలా కెప్టెన్సీ కంటే మూడు ఫార్మాట్లకు ఫిట్ గా ఉంటూ అందుబాటులో ఉండడమే రోహిత్ శర్మ కు అతిపెద్ద టాస్క్ అంటూ నభా కరీం  చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇప్పటికే రోహిత్ శర్మ ఫిట్నెస్  సమస్యల కారణంగా ఎన్నో సార్లు గాయపడ్డాడు. ఇలాంటి సమయంలో అతన్ని టెస్ట్ కెప్టెన్ గా నియమించాలి అనుకుంటే ముందుగా ఫిట్నెస్ కోచ్ ఫిజియో తో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తరచుగా గాయాల బారిన పడే  ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడం ఏ మాత్రం మంచిది కాదు అంటూ  అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: