ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ మైన టెస్టు ఫార్మాట్,  50 ఓవర్ల తో కూడిన వన్డే ఫార్మాట్ మాత్రమే ఉండేవి. కానీ ఎప్పుడైతే అంతర్జాతీయ క్రికెట్లోకి టీ-20 ఫార్మెట్ ఎంటర్ అయిందో ఇక అప్పటినుంచి అంతర్జాతీయ క్రికెట్ దశా దిశా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ సుదీర్ఘమైన టెస్టు ఫార్మాట్లో ఆదరించడం  మొదలుపెట్టారు. ప్రేక్షకులందరికీ కావాల్సిన మెరుపు ప్రదర్శనలు టి20 ఫార్మాట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ వస్తుందంటే చాలు మిస్సవకుండా టీవీలకు అతుక్కుపోయి మరి వీక్షిస్తున్నారు. అదే సమయంలో అటుకొంచెం క్రికెట్ ను శాసిస్తున్న  బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించడం జరిగింది.


 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశీ ఆటగాళ్లు పోటీపడి మరీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇటీవలే జరిగిన ప్రసార హక్కుల వేలం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హవా మరింత పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రిచెస్ట్ లీగ్ లలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా టి20 క్రికెట్కు ఆదరణ  పెరిగిపోయిందని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్  రవి శాస్త్రి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 త్వరలో రెండు భారత టి20 లీగ్ లను మీరు చూడబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. నాకైతే ఆశ్చర్యమేమీ లేదు.  ఇప్పుడున్న ఫార్మాట్ ప్రకారమే రానున్న రోజుల్లో కూడా పూర్తి సీజన్ ఉంటుంది. 10 లేదా 12 జట్లతో రెండున్నర నెలలపాటు మ్యాచ్లు జరగనున్నాయి.  ఒకవేళ ద్వైపాక్షిక సిరీస్ లను తగ్గిస్తే ఇక భారత్ లో ఐపీఎల్ రెండు సీజన్ లు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచకప్ ఫార్మాట్ ఎలాగైతే ఉంటుందో ఆ పద్ధతిలోనే ఐపీఎల్ నిర్వహించే ఛాన్సులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సప్లై డిమాండ్ సూత్రం ప్రకారం ఇది సాధ్యమవుతుందని రావిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl