ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లెజెండ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అందులో మొదటి వరుసలో వినిపించే పేరు సౌరవ్ గంగూలి. టీమిండియాకు సరికొత్త దూకుడు నేర్పిన ఈ క్రికెటర్ కెప్టెన్ గా ఎన్నో అద్వితీయమైన విజయాలను జట్టుకు అందించాడు అనే చెప్పాలి. అంతే కాదు ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు సౌరవ్ గంగూలీ. అందుకే భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా ఎదిగాడు అని చెప్పాలి. ఎంత మంది క్రికెటర్లు ఉన్నా సౌరవ్ గంగూలీకి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు.


 అయితే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అటు క్రికెట్ కి ఏదో ఒక విధంగా దగ్గరగా ఉంటూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా బిసిసిఐ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రతి ఏడాది నిర్వహించే లెజెండ్స్ క్రికెట్ లీగ్లో ఈసారి సౌరవ్ గంగూలీ బరిలోకి దిగుతారూ అని అందరూ భావించారు. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల తర్వాత సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ ప్రదర్శన మళ్లీ చూడవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ లెజెండ్ క్రికెట్ లీగ్లో ఆడటం లేదు అంటూ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.


 ఇలాంటి సమయంలో అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచెత్తే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి గ్రౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది. లెజెండ్స్ క్రికెట్ లీగ్ వచ్చే సీజన్ భారత్ వేదికగానే జరగబోతుంది. దీంతో జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోని షేర్ చేశాడు సౌరవ్ గంగూలి. ఆజాది కా  అమృత్ మహోత్సవ్ ఫండ్ రేసింగ్ కోసం చారిటీ మ్యాచ్ కోసం సిద్దం అవుతు ఉండడం బాగుంది అంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇందుకోసం శిక్షణ తీసుకుంటున్న త్వరలో లెజెండ్ క్రికెట్ లీగ్లో భాగం కాబోతున్నాను.. మళ్లీ బంతి ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నా అంటూ రాసుకొచ్చాడు సౌరవ్ గంగూలి.

మరింత సమాచారం తెలుసుకోండి: