భారత్ వేదికగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు విజయం సాధించడం ఖాయమని ఎంతోమంది టీమ్ ఇండియా అభిమానులు కూడా అంచనాలు పెట్టుకుంటూ ఉన్నారు. స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకొని అటు భారత జట్టు అద్భుతంగా రాణించడం ఖాయమని భావిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఇక వచ్చే ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అదే సమయంలో వరల్డ్ కప్ పోరును  మరింత నాణ్యమైన ప్రసారాల ద్వారా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు అందించేందుకు ఇక ఐసీసీతో కలిసి బీసీసీఐ కూడా ముందుకు సాగుతుంది అని చెప్పాలి.


 ఇదిలా ఉంటే ఇక భారత్లో వన్డే వరల్డ్ కప్ నిర్వహించడంపై ఏకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షాక్ ఇవ్వబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం అదే విధంగా ఉన్నాయి. అయితే ఇలా ఐసిసి ఏకంగా భారత్ నుంచి వరల్డ్ కప్ వేదికను మార్చే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. దీనికి కారణం ఏకంగా పన్ను చెల్లింపులే అన్నది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హార్ట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భారత్ లో వన్డే వరల్డ్ కప్ ను నిర్వహించాలి అంటే ఏకంగా ప్రభుత్వానికి 900 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


 అయితే భారత్ లో వన్డే వరల్డ్ కప్ నిర్వహించేందుకు గాను ఇక బీసీసీఐ ఏకంగా ప్రభుత్వంతో మాట్లాడి పన్ను మినహాయింపు ఇప్పించాలి అంటూ ఎన్నోసార్లు కోరింది. అయితే ఐసీసీ ఎన్నిసార్లు పన్ను మినహాయింపుకు సంబంధించి చర్చలు జరిపిన కూడా బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదట. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ చెల్లించే పన్ను 900 కోట్ల రూపాయలను బీసీసీఐ వాటాలో కోత విధించడం లేదా వేదికను మార్చడం పైన ఐసీసీ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం భారత్లో వన్డే వరల్డ్ కప్ జరగడం అనుమానంగానే కనిపిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc