ఇక వెస్టిండీస్‌ చేతిలో సెకండ్ వన్డే ఓడిపోయిన ఇండియన్ టీం పై అటు అభిమానులు, ఇటు మాజీలు విమర్శలు ఇంకా దారుణంగా కురిపిస్తూనే ఉన్నారు. 'ఇలా ఓడిపోవడమేనా వన్డే ప్రపంచకప్‌ కోసం చేసే సన్నాహాలు' అంటూ పలువురు అభిమానులు అయితే చాలా రకాలుగా మండిపడుతున్నారు.ఈ కాలం ఆటగాళ్లు డబ్బు, గర్వం వల్ల ఆటపై దృష్టి పెట్టడంలేదని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా విమర్శించాడు. ఇంకా ఈ తరహాలోనే మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా భారత జట్టు ఆటతీరుపై విమర్శనాస్త్రాలు సంధించాడు. అన్ని ఉన్నా కూడా టీమిండియా చాలా దారుణంగా విఫలమవుతోందని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చేతులెత్తేస్తోందని ప్రసాద్ అన్నాడు.శనివారం నాడు జరిగిన రెండో వన్డేలో ఇండియా ఓడిపోయిన నేపథ్యంలో వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ ట్వీట్ చేశాడు. తన ట్వీట్‌లో ప్రసాద్ 'టెస్ట్ క్రికెట్ తప్ప రెండు ఫార్మాట్లలో కూడా టీమిండియా చాలా అర్డినరీగా ఆడుతోంది. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా ఇంకా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లను దారుణంగా కోల్పోయింది. చివరి 2 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీల్లో కూడా పేలవంగా ఆడింది. భారత జట్టు ఇంగ్లాండ్ లాంటి ఎగ్జైటింగ్ టీమ్ లేదా ఆస్ట్రేలియా లాంటి దూకుడు జట్టు కాదు. డబ్బు, అధికారం ఉన్నా సాధారణ విజయాలకే మనం సంబరాలు చేసుకుంటున్నాం. అయితే చాంపియన్‌గా మాత్రం భారత జట్టు చాలా దూరంలో ఉంది. భారత్‌ సహా అన్ని జట్లు కూడా చాంపియన్ అవ్వాలనే ఆడతాయి కానీ కాలానుగుణంగా మారిన టీమిండియా వైఖరి, ఆటతీరు పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణమ'ని ఆయన ట్వీట్ చేశాడు.ఇక వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీం ఇండియా కరేబియన్లపై 1-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ని గెలుచుకుంది. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో గెలిచినా కూడా రెండో మ్యాచ్ లో చాలా ఘోరంగా విఫలమైంది. దీంతో 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1 గా సమమైంది. ఇక మంగళవారం నాడు జరిగే మూడో వన్డేలో గెలిస్తేనే సిరీస్ మన సొంతం అవుతుంది. లేకుంటే చెత్త ప్రదర్శనతో వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత సాధించలేని వెస్టిండీస్ టీమ్  చేతిలో వన్డే సిరీస్‌ని కోల్పోయామన్న అపకీర్తిని ఖచ్చితంగా మూటకట్టుకోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: