చైనాకు చెందిన ప్రముఖ బ్రాండెడ్ దిగ్గజ సంస్థలలో ఒకటైన ఒప్పో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల మొబైల్స్ ను సైతం విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో స్మార్ట్ మొబైల్ ను విడుదల చేసిన ఒప్పో సంస్థ ఇప్పుడు తాజాగా మరొకసారి సరికొత్త మొబైల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ ఒప్పో k-11 పేరుతో ఈ స్మార్ట్ మొబైల్ ని లాంచ్ చేసింది.. ప్రస్తుతం ఈ మొబైల్ 5జి స్మార్ట్ మొబైల్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నది..


త్వరలోనే ఈ స్మార్ట్ మొబైల్ ఇండియాలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.మరి ఒప్పో k-11 స్మార్ట్ మొబైల్ యొక్క ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.OPPO K-11 స్మార్ట్ మొబైల్ ఆక్టో కోర్ 6NM కోల్కమ్ స్నాప్ డ్రాగన్ 782 ఎస్ఓసి చీప్ సెటప్ తో కలదు.  ఈ స్మార్ట్ మొబైల్ 100 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 5000 MAH బ్యాటరీ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. ఈ మొబైల్ కేవలం పది నిమిషాలలో మాత్రమే 50% చార్జింగ్ చేస్తుందట.26 నిమిషాలలోనే 100% చార్జింగ్ పూర్తి అవుతున్నట్లు తెలుస్తోంది.


ఈ స్మార్ట్ మొబైల్ ధర విషయానికి వస్తే ఇందులో మూడు రకాల వేరియంట్ మొబైల్స్ కలవు.. ఇండియన్ కరెన్సీ ప్రకారం 8GB RAM+256 GB స్టోరీస్ కలిగిన మొబైల్ ధర విషయానికి వస్తే.. రూ.21 వేలు కలదు.. వేరియేషన్ బట్టి ధరలలో మార్పులు ఉంటాయి.  స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ మొబైల్ డిస్ప్లే 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి ఓ ఎల్ ఈ డి డిస్ప్లే కలదు. HDR -10 సపోర్టుతో పనిచేస్తుంది.. కెమెరా విషయానికి వస్తే 50 mp పిక్సెల్ కెమెరాతో పాటు సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: