ఎయిర్ ఇండియా చరిత్ర :
1932 సంవత్సరం లో టాటా సన్స్ అధినేత జహంగీర్ రతన్ జీ దాదాబాయ్ టాటా ఎయిర్ ఇండియా ను ఎయిర్ వేస్ పేరు తో ప్రారంభించారు . ఎయిర్ వేస్ తొలి క్రాఫ్ట్ ను జంషెడ్ జీ టాటా నడిపి ప్రారంభించారు. తరువాత 1938 లో ఎయిర్ వేస్ సేవలను విదేశాలకు విస్తరిస్తూ ఎయిర్ లైన్స్ గా పేరు మార్పు చేసారు . రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎయిర్ లైన్స్ భారీ నష్టాల్లో కూరుకుపోవడం మరియు భారత ప్రభుత్వం జాతీయికరణ పేరుతో ఎయిర్ లైన్స్ ను ప్రభుత్వ పరం చేసుకుంది. భారత ప్రభుత్వం 1977 వరకు కూడా ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వాహణ భాద్యతలను టాటా లకు అప్పగించింది. 1977 తరువాత ఎయిర్ లైన్స్ ను ఎయిర్ ఇండియాగా నామ కారణం చేసి దాదాపు 68 సంవత్సరాలు ఎయిర్ ఇండియా ను ప్రభుత్వం నడిపింది. ఎయిర్ ఇండియా సంస్థకు 127 ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయ్. ఎయిర్ ఇండియా ప్రస్తుతం 42 దేశాలకు సేవలందిస్తోంది.
ప్రస్తుతం ఎయిర్ ఇండియా నష్టాల్లో నడవడం, అప్పుల భారం పడుతూ ఉండడం తో 100 శాతం వాటాలను ప్రయివేట్ సంస్థ లకు విక్రయించాలని అనుకుంది. 2020 లో ఓపెన్ బిడ్ లో టాటా సన్స్ సంస్థ బిడ్ వేయగా 18000 కోట్ల తో బిడ్ ను కైవసం చేసుకుంది. 2021 డిసెంబర్ నాటికీ ఎయిర్ ఇండియా నిర్వహణ హక్కులను ప్రభుత్వం పూర్తిగా టాటా గ్రూప్ సంస్థకు అప్పగించనుంది.
అయితే 68 సంవత్సరాల తరువాత ఎయిర్ ఇండియాను కైవసం చేసుకోవడం యావత్ భారత ప్రజానీకం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.