దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో గత వారం రోజులుగా ప్రతిరోజూ 9,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 9,987 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 
 
దేశంలో గత వారం రోజుల్లో 67,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1868 మంది మృత్యువాత పడ్దారు. భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఐదో స్థానంలో ఉంది. గడచిన 24 గంటల్లో 331 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. దేశంలో ఈ స్థాయిలో కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: