గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని అమరావతిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమరావతి నేటికీ బంగారు బాతేనని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతుల్లో 26 కోట్ల బంగారు గుడ్డు పెట్టింది అని టీడీపీ నేతలు అంటున్నారు. అమరావతి బ్రాండ్ విలువపై తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లు చేశారు. 

2018లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రూ.2000 కోట్లకు రాజధాని అమరావతి బాండ్లను జారీ చేసింది. వాటికి విశేష స్పందన రావడంతో గంటల్లోనే బాండ్లు అమ్ముడయ్యాయి. చంద్రబాబు, అమరావతికి ఉన్న బ్రాండ్ విలువ అలాంటిది మరి. 2018-19 నుంచి ఇప్పటివరకు బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకునే నగరాలు, పట్టణాభివృద్ధి సంస్థలకు ప్రతి 100 కోట్లకు 13 కోట్ల చొప్పున గరిష్టంగా 26 కోట్ల ప్రోత్సాహకాన్ని కేంద్రం ప్రకటించింది. దాని ప్రకారం చూసుకుంటే జగన్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అమరావతి కారణంగా 26 కోట్లు సమకూరుస్తోంది అనేది టిడిపి అధికారిక ట్విట్టర్ నుంచి చేసిన పోస్టుల సారాంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: