ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి, తాజాగా కృష్ణా కరకట్టపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి అవనిగడ్డ వెళుతున్న ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు గల్లంతవగా మరొకరు గాయపడ్డారు. ఇక కారులో ఉన్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రవాహంలో వాహనం కొంత దూరం కొట్టుకెళ్లి ఆగింది. ఇక గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, మోపిదేవి మండలం కొత్తపాలెం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ చిరువోలు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. ఇక కృష్ణా కరకట్టపై ప్రమాదానికి సంబందించిన విషయం మీద పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది, పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ కు కనెక్ట్ అయి ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: