ఇటీవల కాలంలో ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గడం లేదు. దీంతో ఈ సృష్టికి మూలమైన ఆడపిల్ల ప్రతిక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ క్షణంలో కామాంధులు వచ్చి మీద పడి పోతారో అని అడుగు అడుగునా ఆడపిల్ల భయంతో వణికిపోయే పరిస్థితులు నేటి రోజుల్లో కనిపిస్తున్నాయి. మానవత్వమున్న మనుషులే కామంతో ఊగిపోతూ మానవ మృగాలుగా మారుతూ.దారుణం గా వ్యవహరిస్తున్నారు. కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపించిందంటే చాలా దారుణంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడ ఎవరిలో భయం మాత్రం కనిపించడం లేదు అని చెప్పాలి. ఇక మొన్నటి వరకు బయటి వారి నుంచి ఆడపిల్లకు లైంగిక వేధింపులు ఎదురవ్వగా ఇటీవల కాలంలో సొంత వారు సైతం  ఆడపిల్లలపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆడపిల్ల పై అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్నాయి కోర్టులు. ఇటీవలే మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి కోర్టు ఊహించని ఈ శిక్షను విధించిం.ది ఏకంగా ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.


 కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కృష్ణ కు ఇలా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 25 వేల జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఖమ్మం మొదటి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్ కోర్టు ఈ తీర్పును వెలువరించడం గమనార్హం. గతంలో కృష్ణ ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయ్యాడు. అయితే ఇక ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. ఇక ఈ ఆధారాలు అన్నిటిని కూడా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు లో సమర్పించారు పోలీసులు. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతూ వచ్చింది. ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది కోర్టు. బాలికపై అత్యాచారం నిందితుడికి  20 ఏళ్ల జైలు శిక్ష 25 వేల జరిమానా విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: