సామాన్యుడికి దెబ్బ కొట్టే పనులు ఎవరూ చేయకూడదు. ముఖ్యంగా రాజకీయ నాయకుల అనుచరులు దందాలు చేయడం చాలా వరకు ఆయా ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. రమణా రెడ్డి అనే వ్యక్తి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద కారులో పోస్టులు పెట్టాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంట గ్రామం ఆయనది. వైసీపీ నేత బాల్ రెడ్డి రమణారెడ్డికి బావ అవుతారు.


రమణా రెడ్డి తండ్రి మరో నలుగురు కలిసి నంద్యాల చుట్టు పక్కల రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. అందులో కొన్ని రకాల భూములు కొన్నారు. అందులో ఈయనకు రూ.16 కోట్ల ఆస్తులు రావాల్సి ఉంది. అయితే బాల్ రెడ్డి కొడుకులు తనకు వ్యాపారంలో రావాల్సిన వాటాను రాకుండా అడ్డుకుంటున్నారని ఈయన ఆరోపణలు చేశారు.


బాల్ రెడ్డి కొడుకు మల్లికార్జున్ రెడ్డి, తదితరులు భూములు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల విజయేంద్ర నాథ్ రెడ్డి అనుచరుడు. ఈ విషయంలో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని బెదిరించడమే కాకుండా భూమిని ఇవ్వడం లేదని వాపోయారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదని ఇక తన కుటుంబానికి ఆత్మహత్యే శరణమ్యని అంటున్నారు.


అయితే ఈ భూములు విషయంలో జరిగిన నిజనిజాలను పరిశీలించి న్యాయం ఉందని తెలిస్తే రమణారెడ్డికి కచ్చితంగా తనకు హక్కుగా రావాల్సిన భూములను డబ్బులను కచ్చితంగా ఇప్పించాలి. అంతే కానీ ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి ఇష్టారీతిన చేస్తామంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీతో పాటు అక్కడి నాయకుల గెలుపు కష్టమే. ఇలాంటి విషయాలే పార్టీలను అధికారం నుంచి దూరం చేస్తాయి. కాబట్టి వైసీపీ నేతలు ఇలాంటి అక్రమమైన విషయాల్లో తల దూర్చకుండా ఉంటే మంచిదని జగన్ పేరును అప్రతిష్ట పాలు చేయొద్దని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: