పంజాబ్ లో తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటలకు తెరుస్తారు. మధ్యాహ్నం 2 గంటలకే కార్యాలయాల్ని మూసేస్తారు. వేసవి దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. కరెంట్ ను ఆదా చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. అయితే గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల పని వేళలు ఉండేవి. కానీ ఈ నిర్ణయంతో   ఏ పని ఉన్నా ఉదయమే ఆఫీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ పని వేళలు మే 2 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సీఎం అన్నారు. మధ్యాహ్నం రెండున్నరకు వెళ్లిపోతే ఆ తర్వాత వచ్చే ప్రజలు వెళ్లిపోవాల్సిందే. ఈ నిర్ణయం చాలా అద్భుతమని ఆయా మీడియా సంస్థలు చూపిస్తున్నాయి.


కానీ ఆ పని వేళలు వల్ల ఎవరికైనా లాభం ఉంటుందా.. ఎవరు నష్టపోతారు. ఎవరికి లాభం ఉంటుంది. తదితర అంశాలను ఎవరూ పరిగణించడం లేదు. ఒక వేళ ప్రభుత్వ కార్యాలయాలకు ఉదయం 7.30 గంటలకు రావాలంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చే వారు ఏ విధంగా రాగలరు. ఆఫీసుకు వచ్చే సరికి 12, ఒక్కోసారి 1 గంట కూడా కావచ్చు. అప్పటికే ఎంతో మంది లైన్లలో నిలుచుంటారు. వారికి కావాల్సిన పనులు జరగవు. రేపు రండి అంటూ అధికారులు తిరిగి పంపించేస్తుంటారు.


ఉదయం పిల్లలను స్కూలుకి, ట్యూషన్లకు పంపే గృహిణులు, ఒక వేళ ఆఫీసులకు వెళ్లాలంటే వారు ఉదయం ఎన్ని గంటలకు లేవాలి. తొమ్మిది గంటలకే ఆఫీసు అంటే 11 దాటినా కార్యాలయాలకు రాని ఆఫీసర్లు ఉంటారు. వారు సమయానికి రాకపోతే ఎలా.. వీటిన్నింటిని గురించి ఆలోచించి ప్రశ్నించే వారే కరవయ్యారు. ప్రజా సమస్యల గురించి ప్రశ్నించడంలో మన తెలుగు మీడియా మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇలాంటి ప్రశ్నించే పత్రికలు అక్కడ లేకపోవడం బాధాకరమే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: