నందమూరి బాలకృష్ణ ఇటీవలె హైదరాబాద్ లో మరో కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. జూబ్లిహిల్స్ లో కొన్న ఇంటి విలువ దాదాపు రూ.15 కోట్లు. బాలకృష్ణ గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇందులో బాగంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రాపర్టీలు కొనుగోలు చేస్తున్నారు. మంచి ధర రాగానే వాటిని అమ్మేస్తున్నారు. ఇలా ఏపీలోని విజయవాడ, విశాఖ, అమరావతితో పాటు అనంతపూర్ లో పలు ప్రాపర్టీలను కొనుగోలు చేసి అమ్మకాలు చేశారు. సినీ రంగంలో వచ్చే డబ్బులను ఇలా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోనూ బాలకృష్ణ రియల్ ఎస్టేట్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు ప్రాపర్జీలు కొనుగోలు చేసిన బాలయ్య.. మంచి రేటు రాగానే అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ భవంతిని ఫిబ్రవరి 11న కొనుగోలు చేశారు.

Zapkey.com అనే వెబ్ సైట్ ప్రకారం నందమూరి బాలకృష్ణ ఈ ప్రాపర్టీని నడంపల్లి సత్య శ్రావణి నుంచి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జీ ప్లస్ టూ అంటే గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో రెండు అంతస్తులు కలిగిన భవంతిని కొనుగోలు చేశారు. భవనం ఏరియా 9395 చదరపు అడుగులు. ఈ ప్రాపర్టీని బాలయ్య, వసుంధరా దేవి దంపతుల పేరు మీద ఉంది. డాక్యుమెంట్లను బట్టి బాలయ్య దంపతుల మీద రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలుస్తోంది.

బాలకృష్ణ మాత్రమే కాదు సినీ రంగంలో ప్రముఖులు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు. సినిమాల్లో లైఫ్ ఎంత వరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటే అంతే సంగతులు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఇక్కడ వచ్చే డబ్బులను వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారు. సినిమాలు ఉన్నా లేకపోయినా బిజినెస్ ను కొనసాగించవచ్చనే ఆలోచనతో నటీనటులు ముందుకెళ్తున్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్లు బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: