పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం నిర్మిస్తుండగా పీరియాడిక ల్ డ్రామా గా చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుండడం విశేషం. నేవర్ బిఫోర్ అనే రోల్ లో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ప్రేక్షకుల కోసం దర్శనమివ్వనున్నారు. నిధి అగర్వాల్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉంటే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చూశారు. కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ లో జాప్యం జరగడంతో ఈ సినిమా వాయిదా పడక తప్పలేదు. దాంతో వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చూశారు.  సంక్రాంతి సీజన్ కు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా భీమ్లా నాయక్ సినిమా విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో క్రిష్  పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో ఖుషి సెంటిమెంటును వాడ బోతున్నారు. ఏప్రిల్ 27న 2001వ సంవత్సరంలో ఖుషి సినిమా విడుదలై మంచి హిట్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా ఏ ఎమ్ రత్నం నిర్మించడం విశేషం.

ఆ విధంగా హరిహర వీరమల్లు సినిమాను ఖుషి విడుదలైన ఏప్రిల్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని క్రిష్ భావించడంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేస్తున్నారు. ఈ సినిమా కూడా ఖుషీ రేంజిలో ప్రేక్షకులను అలరించడం ఖాయమని అంటున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలోనీ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో గబ్బర్ సింగ్ సినిమా రాగా అంతకు మించి ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేశాడు హరీష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: