పవన్
కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ
నిర్మాత ఏ.ఎం రత్నం నిర్మిస్తుండగా పీరియాడిక ల్ డ్రామా గా చారిత్రాత్మక నేపథ్యంలో ఈ
సినిమా రూపొందుతుండడం విశేషం. నేవర్ బిఫోర్ అనే రోల్ లో పవన్
కళ్యాణ్ ఈ సినిమాలో ప్రేక్షకుల కోసం దర్శనమివ్వనున్నారు.
నిధి అగర్వాల్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాకి
కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 2022
సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చూశారు.
కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ లో జాప్యం జరగడంతో ఈ
సినిమా వాయిదా పడక తప్పలేదు. దాంతో వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చూశారు. సంక్రాంతి సీజన్ కు పవన్
కళ్యాణ్ నటిస్తున్న మరో
సినిమా భీమ్లా
నాయక్ సినిమా విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో క్రిష్ పవన్
కళ్యాణ్ సినిమా విషయంలో
ఖుషి సెంటిమెంటును వాడ బోతున్నారు. ఏప్రిల్ 27న 2001వ సంవత్సరంలో
ఖుషి సినిమా విడుదలై మంచి హిట్ గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా ఏ ఎమ్ రత్నం నిర్మించడం విశేషం.
ఆ విధంగా హరిహర వీరమల్లు సినిమాను
ఖుషి విడుదలైన ఏప్రిల్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని క్రిష్ భావించడంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా ఎగిరి గంతేస్తున్నారు. ఈ
సినిమా కూడా
ఖుషీ రేంజిలో ప్రేక్షకులను అలరించడం ఖాయమని అంటున్నారు. ఇకపోతే పవన్
కళ్యాణ్ హీరోగా
హరీష్ శంకర్ దర్శకత్వంలోనీ
సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో
గబ్బర్ సింగ్ సినిమా రాగా అంతకు మించి ఈ
సినిమా ఉండేలా ప్లాన్ చేశాడు హరీష్.