తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీ అంటే బాగా గుర్తొచ్చే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత సినీ ఇండస్ట్రీ లో కొన్ని మార్పులు జరిగాయని చెప్పవచ్చు.. అప్పటివరకు ఇద్దరు స్టార్ హీరోలు కలవాలంటే ఏదైనా ఫంక్షన్ లో, అవార్డు ఫంక్షన్ వంటి వాటిల్లోనే చూసేవాళ్లం. కానీ ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువ కావడంతో.. అందరి హీరోల మధ్య అనుబంధం బాగా పెరుగుతూ వస్తోంది.. అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత మహేష్ బాబు మల్టీస్టారర్ సినిమాకి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.

ఇక అంతే కాకుండా మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టపడే హీరో విజయ్ దేవరకొండ కూడా నటిస్తాడన్నట్లుగా సమాచారం. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మల్టీస్టారర్ సినిమా కూడా ఈ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తారనే సినీ ఇండస్ట్రీలో టాక్. అందుకు సంబంధించిన స్టోరీలు మహేష్ బాబుకు తెలియజేసినట్లు గా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా టాక్. అయితే రెండవ హీరో పేరు మాత్రం విజయ్ పేరే వినిపిస్తోంది.. కానీ ఇంకా ఈ హీరో ని ఇంకా అడగలేదట.

ఇక విజయ్ కి కూడా గీతాగోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని ఇచ్చాడు పరశురామ్.. అయితే ఇంకా మహేష్ బాబు తో అంటే విజయ్ నో చెప్పే అవకాశం లేదు. అందుచేత ఇక ఈ మల్టీ స్టారర్ మూవీ సెట్ అయింది అన్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలకు ఓకే చేస్తూ ఉన్నారు. మహేష్ బాబు డేట్స్ ఈ మల్టీ స్టారర్ మూవీ కి లాక్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ సినిమా రెండు బడా డైరెక్టర్లతో సినిమా చేసిన తర్వాత ఉంటుంది అన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: