పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. క్రిష్ తీస్తున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అత్యంత భారీ వ్యయంతో ప్రతీష్టాత్మకంగా ఏ ఎం రత్నం పవర్ఫుల్ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో వీరమల్లు పాత్రలో పవన్ అదిరిపోయే రేంజ్ లో పెర్ఫార్మన్స్ చేస్తున్నారని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ మూవీ పెద్ద సక్సెస్ కొట్టడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. ఇక దీని తరువాత హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయనున్నారు పవన్ కళ్యాణ్.
మైత్రి మూవీ మేకర్ సంస్థపై ఎంతో భారీ వ్యయంతో ఈ మూవీ నిర్మితం కానుండగా ఆపైన సముద్ర ఖని డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ తో కలిసి కూడా పవన్ ఒక మూవీ చేయనున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కి మంచి మిత్రుడు అయిన యువ నిర్మాత ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి తో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్నారని, అలానే దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారని ఇటీవల కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. అలానే వారి కాంబో మూవీ త్వరలో పట్టాలెక్కుతుందని కూడా న్యూస్ వచ్చింది. కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ఈ మూవీ హోల్డ్ లో పడిందని టాక్.

దీనికి కారణం, పవన్ కళ్యాణ్ తో సముద్రఖని మూవీ ఓకే అవ్వడమే అని, ఆ మూవీకి పవన్ బల్క్ గా డేట్స్ ఇచ్చారని అంటున్నారు. ఓవైపు హరీష్ శంకర్ మూవీ తో పాటు మరోవైపు సముద్ర ఖని మూవీ ని పూర్తి చేసిన అనంతరమే పవన్ తదుపరి ప్రాజక్ట్స్ గురించి ఆలోచించనున్నారట. దీని ప్రకారం ఇప్పటికి అయితే సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి మూవీ ప్రక్కనపెట్టినట్లే అని కొందరు అంటున్నారు, మరికొందరైతే అసలు ఈ మూవీ పూర్తిగా క్యాన్సిల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన వస్తేనే కానీ నమ్మలేం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: