మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు సినిమాలు రూపొందుతున్నాయి. వాటి లో ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలోని భోళా శంకర్ సినిమా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటిని విడుదలకు సిద్ధం చేసిన నేపథ్యంలో తన తదుపరి సినిమా యొక్క షూటింగ్ను మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. 

బాబీ దర్శకత్వంలో ఆయన తన తదుపరి సినిమాను చేస్తున్న విషయం అందరికీ తెలి సిందే. ఇటీవలే ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా వీరయ్య అనే మాస్ పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేసే ఇప్పటి దర్శకులు అందరూ కూడా ఆయన కు అభిమానులే అయి ఉంటారు. ఆ విధంగా బాబీ కూడా మెగాస్టార్ అభిమాని ని అని చెప్పి ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెబుతున్నారు. తన అభిమానాన్ని అంతా ఈ సినిమాలో ప్రతి ప్రేమలో నింపి ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇస్తానని ఆయన వెల్లడించడం విశేషం.

 సెట్స్ లో కూడా ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా ఆయన తీర్చిదిద్దుతున్నారట. వాస్తవాని కి స్క్రిప్ట్ విషయంలోనే బాబీ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడని అంటున్నారు. చిరంజీవి కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా బాబీకి కావలసినంత సమయాన్ని ఇచ్చి ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ పనుల ను బాగా వచ్చేలా చేశారు. అలా చిరంజీవి అనుకున్న విధంగా కథను తీర్చిదిద్దిన బాబీ ఇప్పుడు ఈ సినిమాను ఎంతటి స్థాయిలో రూపొందిస్తాడో అనేది చూడాలి. అలా ఈ సినిమా తో తప్పకుండా విజయం ఆయన అందుకోవడం ఖాయం అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: