ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు తాజాగా ఓటీటి లో అలరించడానికి సిద్ధమైంది అన్నట్లుగా తెలుస్తోంది. యాక్షన్ త్రిల్లర్ చిత్రం ప్రముఖ ఓటీటి సంస్థ అయిన అహ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 18 వ తేదీన ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఇక ఈ విషయాన్ని ఆహా టీమే స్వయంగా తెలియజేశారు.
సర్దార్ చిత్రం అక్టోబర్ 21న థియేటర్లలో విడుదల కాగా ఈ చిత్రంలో హీరోయిన్లుగా రాశిఖన్నా, రజిష విజయన్ నటించారు. ఈ ఆలనాటి హీరోయిన్ లైలా కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కార్తీక్ 6 విభిన్నమైన గెటప్పులలో కనిపించారు. వైవిద్యమైన కథ కావడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఈ చిత్రాన్ని తెలుగులో అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పైన విడుదల చేయడం జరిగింది. మరి ఈ చిత్రం వచ్చేవారం ఓటీటి లో ఏ రేంజ్ లో అలరిస్తుందో అని విషయం పై తెలియాల్సి ఉంది.