ఈ మధ్య కాలంలో ఒక ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమా లను మరో ఇండస్ట్రీ లో రీమేక్ చేయకుండా నేరు గా అదే మూవీ హక్కు లను కొనుక్కొని డబ్బింగ్ చేస్తూ విడుదల చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో భాష లలో సూపర్ హిట్ విజయా లను అందుకున్న సినిమా లను తెలుగు లో విడుదల చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి . 

అలాగే తెలుగు లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా లను ఇతర భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ నెల 21 వ తేదీన టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ "విరూపాక్ష" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది.

మంచి అంచనాల నడుమ తెలుగు భాషలో విడుదల అయిన ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచింది. ఇలా తెలుగు భాషలో విడుదల అయ్యి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లో మలయాళ భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క మలయాళ థియేటర్ హక్కులను E4 ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. విరూపాక్ష మూవీ ని మలయాళం లో థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు కూడా ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: