డబ్బు..డబ్బు.. డబ్బు.. ప్రస్తుత కాలంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేకుండాపోయింది. ఈ జగం అంతా డబ్బు మయం అన్నట్టుగా ఏ చిన్న అవసరం వచ్చినా సరే డబ్బు తప్పక అవసరం. అయితే కొంతమంది ఈ డబ్బులు సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తే, మరి కొంతమంది సంపాదించిన డబ్బులు దాచుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే డబ్బులు దాచుకోవాలి అని అనుకుంటున్నారో, అలాంటి వారికోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పోస్ట్ ఆఫీస్ లు , ఎల్ఐసి లు, బ్యాంకులు సరికొత్త పథకాలను, స్కీమ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కానీ కొంతమంది ఇటీవల స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాటివల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు . కానీ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువ రిస్క్ ఉంటుందని చెప్పడం ఖాయం. మ్యూచువల్ ఫండ్స్ లో  ప్రతినెల 500 రూపాయల నుండి రూ. 1500 వరకు ఇన్వెస్ట్ చేయడం వల్ల 30 సంవత్సరాల తరువాత మంచి రాబడి వస్తుందని , ఇన్వెస్ట్మెంట్ నిపుణులు తెలుపుతున్నారు.


ఇక ఇందుకు సంవత్సరానికిగాను 12 శాతం రాబడి కూడా లభిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్లు, ఇతర స్కీమ్ ల కన్నా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎవరైతే తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ మంచి రాబడి పొందాలనుకుంటున్నారో, అలాంటి వారికి ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పవచ్చు.


ఇక ఇందులో నెలకు రూ.1500 ఇన్వెస్ట్ చేయడం వల్ల 30 సంవత్సరాల కాల వ్యవధి ముగిసేసరికి మీ చేతికి రూ.50 లక్షలు వస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ అందించే 12 శాతం రాబడితో కలుపుకుని మొత్తం రూ. 53 లక్షలు  వచ్చే అవకాశం ఉంది. అదే నెలకు 500 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం వల్ల 30 సంవత్సరాలలో మీకు రూ.17లక్షలు మీ సొంతమవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: