ఆంధ్రప్రదేశ్లో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ప్రభుత్వం ఎన్నికలకు సహకరించకపోతుండడంతో దీనిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా ఇటువంటి తీరు ప్రదర్శిస్తుండడం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని ఆయన విమర్శించారు.