మురగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం ఆ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గత దీపావళికి విడుదల అవుతుంది అనుకున్న ఈ టీజర్ శివరాత్రి వస్తున్నా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థుతులలో ఉంది.

ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ఈ మూవీ టీజర్ కు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఈ మూవీలో కొన్ని రోబోటిక్స్ కూడా వాడుతున్నారట. వాటిలో ముఖ్యంగా ఒక రోబో సాలిపురుగును పోలి ఉంటుందని చెప్తున్నారు. 

ప్రస్తుతం రిలీజ్ చేయనున్న టీజర్లోనే ఈ రోబో సాలీడును అందరికీ పరిచయం చేయాలని దర్శకుడు మురగదాస్ ఆలోచిస్తున్నట్లు టాక్. అందువల్లనే ఇప్పుడు లండన్ లో ఒక విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలో ఈ సాలీడు కంప్యూటర్ గ్రాఫిక్స్ ను 35 లక్షలు ఖర్చు పెట్టి చేయిస్తున్నారట. 

ఆ సాలీవుడ్ విలన్ ఉన్న చోట ఉంటూ అక్కడ జరిగే విషయాలన్నీ మహేష్ కు చేరవేస్తుంది అని అంటున్నారు. ఈ వార్తలలో నిజం ఎంతో తెలియకపోయినా మురగదాస్ కు వచ్చిన ఈ ఆలోచన పై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 

ఇప్పటికే ఈమూవీకి ‘సంభవామి యుగే యుగే’ అనే టైటిల్ ను పెట్టినట్లుగా లీకులు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ సాలీడు గ్రాఫిక్స్ లీకులు కూడ మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జూన్ నెలలో విడుదల కాబోతున్న ఈ మూవీ టీజర్ కనీసం ఉగాది కి అయినా విడుదల అవుతుందా అన్న అనుమానాలు చాలామంది వ్యక్తపరుస్తున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: