తెలుగు ఇండస్ట్రీలోకి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున  నటించిన ‘సూపర్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బెంగుళూరు బ్యూటీ అనుష్క. స్వతహాగా యోగా గురువు అయిన అనుష్క ‘సూపర్’ మూవీలో తన గ్లామర్ తో ఎంతగానో ఆకర్షించింది.  ఆ తర్వాత్ తెలుగు, తమిళ స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది.  సాధారణంగా ఇండస్ట్రీలో చాలా మంది డబ్బు మాత్రమే సంపాదించడానికి వెళ్తుంటారు అని టాక్ వినిపిస్తుంది. కానీ కొంత మంది నటులను చూస్తుంటే చేతులెత్తి మొక్కాలని అనిపిస్తుంది.  తమ ఫ్యాన్స్ ఏ కష్టమొచ్చినా వారి కొండంత అండగా ఉంటారు. ప్రకృతి విపత్తుతో ప్రజలు కష్టాలు పడుతుంటే మేమున్నామని ముందుకు వచ్చి విరాళాలు ఇస్తుంటారు.  కొంత మంది స్టార్లు ట్రస్టులు నిర్వహిస్తూ పేదవారిని ఆదుకుంటారు. 

 

ఇలా కొంత మంది సెలబ్రెటీలు తాము సంపాదించిన సంపాదనలో చాలా వరకు కష్టాల్లో ఉన్నవారి కోసం సహాయం చేస్తుంటారు.  అలాంటి వారిలో అనుష్క ఒకరు.  హీరోయిన్‌గా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నిశ్శ‌బ్దం చిత్రబృందం హైద‌రాబాద్‌లో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి.. అనుష్క మంచితనం గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.  కొన్ని నెలల క్రితం ఓ చిత్ర షూటింగ్ కోసం జార్జియా వెళ్లానని... అక్కడ తనకు అసిస్టెంట్ గా  జాజా అనే వ్యక్తిని నియమించారని.. అయితే తాను హైదరాబాద్ నుంచి వచ్చానని తెలుసుకొని వెంటనే నటి అనుష్క గారు బాగున్నారా సార్ అన్నారు. 

 

అప్పుడు నేను షాక్ తిన్నాను.. ఎక్కడో జార్జియాలో ఉన్న వ్యక్తి తెలుగు నటిని గుర్తు పెట్టుకొని మరీ ఆమె బాగోగులు అడుగుతున్నాడేంటా అని అసలు విషయం అడిగాను.  గతంలో అనుష్క జార్జియాకు షూటింగ్ నిమిత్తం వచ్చినపుడు జాజా ని కార్ డ్రైవర్ గా నియమించారట. అయితే ఒకరోజు అతను రాకపోవడంతో ఎందుకు రాలేదని అనుష్క ప్రశ్నించగా తన కారు ఫైనాన్స్ వారు తీసుకు వెళ్లాడని ఇబ్బందుల్లో ఉన్నారని ఆ డ్రైవర్ చెప్పారట. అంతే వెంటనే జాజాను పిలిపించి అతనికి కొత్త కారు కొనిపించిందట. అయినవారే ఈ కాలంలో పట్టించుకోరు.. ఎక్కడే తెలియని వ్యక్తి కష్టాల్లో ఉన్నాడని తెలుసుకొని సహాయం చేసిన ఆమె మంచితనానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: