దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సారథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్చరణ్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రు.300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ సినిమా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్కు ప్రస్తుతం కరోనా వైరస్ బ్రేకులు వేసింది. ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న కరోనా వైరస్ దెబ్బతో అన్ని సినిమాల షూటింగ్లు బంద్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీ ఆదివారం పిలుపు ఇచ్చిన జనతా కర్ఫ్యూకు సైతం దర్శక ధీరుడు రాజమౌళి సపోర్ట్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు ఈ కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కు బ్రేకులు పడడంతో ఈ గ్యాప్లో రాజమౌళి తనకు ఇష్టమైన స్పోర్ట్స్ పై కాన్సంట్రేషన్ చేశారు. రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి- ఎన్టీఆర్- రామ్ చరణ్.. ఈ టోర్నమెంట్ విన్నర్ అయిన నల్లగొండ జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఇప్పుడు వీరు బహుమతులు అందజేస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇంత జరుగుతోన్నా ఈ టీం కరోనా వైరస్ అన్న భయం లేకుండా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేందుకు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు.
ఈ ఫొటోపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు కరోనా పుట్టిన పుహాన్ నగరంలో అక్కడ ప్రభుత్వం కరోనాని పూర్తిగా ఎలా తరిమేసిందో ? అక్కడ ప్రజల్లో ఎలా ధైర్యాన్ని నింపిందో ? ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమా టీం కూడా తమ వంతుగా కరోనా రక్కసి గురించి ఎలాంటి అపోహలు వద్దని.. భయపడాల్సిన అవసరం లేదని ప్రజల్లో ధైర్యం నింపే సాహసం చేస్తోంది. ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఈ నెల 31 వరకు బంద్. ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది.