రామ మందిర నిర్మాణానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విరాళాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. సుప్రీం కోర్టులో వివాదాస్పద అయోధ్య విభాగం హిందువు లకు చెందినది  అంటూ చరిత్రాత్మక తీర్పు వెలువడిన వెంటనే అటు కేంద్ర ప్రభుత్వం రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేకమైన ట్రస్టు ఏర్పాటు చేసింది అనే విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే పదకొండు వందల కోట్లకు పైగా నిధులతో రామమందిర నిర్మాణం చేపట్టేందుకు అయోధ్య ట్రస్ట్  నిర్ణయించింది. అయితే రామ మందిరం నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న రామ మందిర ట్రస్ట్.


 ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు భారీ మొత్తంలో రామమందిర నిర్మాణానికి విరాళాల అందజేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో సామాన్య ప్రజలు కూడా రామాలయ నిర్మాణానికి విరాళాలు అందజేస్తూ ఉండటం గమనార్హం.  హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా మతసామరస్యం తో అయోధ్య రామమందిరం నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ రామమందిర నిర్మాణం కోసం విరాళాలు అందజేయాలి అంటూ అటు సినీ రాజకీయ ప్రముఖులు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే.



 అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే రామ మందిరానికి విరాళాలు అందించి అందరూ ప్రోత్సాహం అందించాలి అంటూ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయారు. ఇక అక్షయ్ కుమార్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా విమర్శలు రావడం వెనుక  కారణం కూడా లేకపోలేదు. దేశంలో ఎంతో మంది ప్రజలు ఆకలితో చస్తూ ఉంటే ఇలా కోట్ల రూపాయలు ఆలయాలకు వెచ్చించడం ఏంటి అని గతంలో అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అలాంటిది ప్రస్తుతం రామమందిర నిర్మాణానికి విరాళం అందించాలని కోరడంతో కపట మాటల అక్షయ్ కుమార్ అంటూ అందరూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: