ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా అనంతరం బన్నీ డైరెక్టర్ కొరటాల శివ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో '#AA21' ప్రాజెక్ట్ రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వెలువడింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా అయిన వెంటనే కొరటాల శివ డైరెక్షన్ లో బిజీ అవుతారని అందరూ భావించారు.

అయితే అనూహ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌తో కొరటాల శివ నూతన సినిమా గురించి  సోమవారం ఎనౌన్స్‌మెంట్‌ రావడంతో... పుష్ప సినిమా తర్వాత బన్నీ, కొరటాల సినిమా ఉండదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  బన్నీ చేస్తున్న'పుష్ప' చిత్ర షూటింగ్ లేట్ అవుతుండటంతో ముందుగా ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి కమిటయ్యారు కొరటాల. ఈ క్రమంలో అసలు బన్నీ- కొరటాల కాంబోలో సినిమా వార్త ఫిల్మ్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది.

ఇందుకు స్పందించిన యువసుధ ఆర్ట్స్‌ ప్రతినిథులు అల్లు అర్జున్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఖచ్చితంగా ఉంటుందని...పరస్పర అంగీకారంతోనే ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది తప్ప.. ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడు అన్న విషయం మాత్రం ప్రకటించలేదు. ఈ అంశంపై కాస్త అసంతృప్తి కనిపించినా... జనతా గ్యారేజ్ తో సూపర్ సక్సెస్ ఫుల్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ ల కలయికతో మరోసారి సినిమా ఉండబోతోందన్న ప్రకటన విని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: