కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కుల, మత, ప్రాంత, భాష తేడా లేకుండా ఈ వైరస్ అందరినీ చుట్టేస్తోంది. కరోనా వైరస్ ముప్పు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారుతోంది. మనదేశంలో ఇప్పటికే వైరస్ మన చేయి దాటి పోయింది అన్న వార్తలు వినపడుతున్నాయి. సామాన్యులే కాదు సెలెబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు సైతం తన ముందు సమానమే అంటోంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ... ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉంటే చాలు, ఈ వైరస్ తన ఉనికిని చాటుకుంటూ అంటుకు పోతోంది. దేశం నుంచి రాష్ట్రాలకు రాష్ట్రాల నుంచి జిల్లాలకు ఇప్పుడు ఏకంగా ప్రతి వీధిలోనూ కరోనా సోకింది అన్న కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఇక కేంద్రం ఇచ్చిన అనుమతితో తిరిగి షూటింగ్స్ ప్రారంభం అవడంతో ఈ వైరస్ పాజిటివ్ వచ్చిందన్న సెలబ్రిటీల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్అల్లు అరవింద్దిల్ రాజు సినీ దిగ్గజాలకు సైతం ఈ వైరస్ దాడి తప్పలేదు. అయితే ఇప్పుడు మరో బిగ్ సెలబ్రిటీ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు... హీరో కళ్యాణ్ దేవ్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే స్వల్ప లక్షణాలే తప్ప, పెద్ద సమస్య ఏమీ లేదని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని, తెలిపారు.

మెగాస్టార్ చిరు రెండవ తనయురాలు శ్రీజ ... భర్త కళ్యాణ్ దేవ్. ప్రస్తుతం హీరో సూపర్ మచ్చి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: