నందమూరి బాలక్రిష్ణ మళ్ళీ దూకుడు చూపిస్తున్నారు. గత రెండేళ్ళుగా సరైన హిట్ లేకపోయినా బాలయ్య అఖండ మూవీ టీజర్ అదరగొట్టడంతో బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీ మీద అంచనాలు ఒక్కసారిగ నింగిని అంటాయి. ఈ నేపధ్యంలో బాలయ్య తరువాత ప్రాజెక్టుల మీద కూడా అందరి దృష్టి పడింది.

ఇదిలా ఉంటే బాలయ్య క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబొలో వస్తున్న మూవీలో హీరోయిన్ గా శృతిహాసన్ ని అనుకుంటున్నారు. ఈ అమ్మడు ఇప్పటికే ఓకే అని చెప్పిందని అంటున్నారు. బాలయ్య వంటి సీనియర్ పక్కన నటించడానికి శృతి హాసన్ ఓకే చెప్పడం ఒక విధంగా విశేషమనే చెప్పాలి.  క్రాక్ తో పాటు అంతకు ముందు తన సినిమాలతో శృతికి హిట్లు ఇచ్చాడు గోపీచంద్. దాంతో ఆయన మాటను కాదనలేక శృతి ఓకే అందని టాక్.

ఇదిలా ఉంటే బాలయ్య కూడా ఇప్పటిదాకా నిర్మాతలు, దర్శకుల మీద ఏ రకమైన డిమాండ్ పెట్టలేదు. తానూ తన సినిమాలు అన్నట్లుగా  ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో బాలయ్య సినిమాలకు స్టార్ హీరోయిన్లు దొరకడంలేదు. దాంతో ఫేడౌట్ అయినా వారితోనే కధ నడిపిస్తున్నారు. దీని మీద బాలయ్యకు కూడా మొదట్లో పెద్దగా పట్టింపు లేకపోయినా ఆయన సన్నిహితులు మీ సినిమాల్లో ఎందుకు స్టార్ హీరోయిన్లు ఉండరు అంటూ ప్రశ్నించడంతో బాలయ్య కూడా దీని మీద ఇపుడు దృష్టి పెట్టారు అంటున్నారు.

తన సినిమాల్లో కచ్చితంగా స్టార్ హీరోయిన్ ఉండాలని లేటెస్ట్ గా బాలయ్య కండిషన్ పెడుతున్నారు అంటున్నారు. ఆ విధంగా ఆయన చెప్పడం వల్లనే శృతి హాసన్ ని గోపీచంద్మూవీ లో తీసుకున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య రానున్న సినిమాల్లో కూడా స్టార్ హీరోయిన్లు కనిపిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి. ఏది ఏమైనా మంచి డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్లతో కొత్త ప్రాజెక్టులు రెడీ అవుతూండడం పట్ల బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారుట.






 







 


మరింత సమాచారం తెలుసుకోండి: