నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ జులై నుండి ప్రారంభం కానున్నట్ల సమాచారం. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా ఈ సినిమా రానుందట. జూలై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.


వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే చర్చ ఇంకా సాగుతూనే ఉంది.మొన్నటిదాకా హీరోయిన్‌గా శ్రుతిహాసన్ అనే టాక్ వినిపించింది. గోపిచంద్ మలినేనికి శ్రుతిహాసన్ లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమెతో చేసిన 'బలుపు, క్రాక్' రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో గోపీచంద్ మరోసారి శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారని టాలీవుడ్ టాక్. 


కానీ ఈ మద్యనే మళ్ళీ త్రిష ని తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఒకరా లేక ఇద్దరా అని కన్ఫ్యూషన్ అయితే అభిమానులలో కలుగుతుంది. అయితే బాలకృష్ణ మిగతా సినిమాల్లోలాగానే ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఛాన్స్ ఉంది అని టాక్. ఇక ఈ మద్యనే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని బాలయ్య ని ఏ రేంజ్ లో చూపిస్తారో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇక బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమా తర్వాత గోపిచంద్ తో సినిమా మొదలుకాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: