కరోనా కాలంలో చాలా మంది సినీ కార్మికులు ఇబ్బందులు పాలైన సంగతి తెలిసిందే. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరియు ముఖ్యంగా పావలా శ్యామల ఉదంతం అందరినీ కంటతడి పెట్టించింది. అనేక వందల సినిమాల్లో నటిగా తన సత్తా నిరూపించుకున్న ఆమెకు ఇప్పుడు రోజు గడవని పరిస్థితి నెలకొనడంతో సినీ పెద్దలు ముందుకు వచ్చి సహాయం చేసిన సంగతి తెలిసిందే.. 

అయితే వయసు రీత్యా ఆమె తనను తాను చూసుకోవడమే కాక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కూతురికి కూడా తానే సేవలు చేయాల్సి రావడంతో సినీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పావలా శ్యామలను ఆమె కుమార్తెను చూసుకోవడానికి కోసం ఒక మనిషిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు కరాటే కళ్యాణి తన ఫేస్బుక్ వేదికగా ఒక తల్లి, కూతురుని చూసుకోవడానికి మనిషి కావాలని ఉదయం ఏడు గంటలకు వచ్చే 7:00 కి వెళ్లే విధంగా ఎవరైనా ఉంటే చెప్పగలరు అని కోరారు. 

''ఎవరైనా ఒక తల్లి కూతురుని (మీకు తెలుసు వాళ్ళు) చూసుకోవాలి, ఇంటిలో 7పొద్దున వచ్చి రాత్రి 7కి వెళ్ళాలి, జీతం ఇస్తారు వెంటనే చెప్పండి'' అంటూ ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చెసరూ. ఏ వయసు వాళ్లు కావాలి, స్త్రీ నా ? పురుషుడైనా పర్లేదా లాంటి వివరాలు కూడ చెప్పండని అడిగితే, స్త్రీ అయినా పర్వాలేదు పురుషుడైన పర్వాలేదు కానీ వాళ్లకు సేవ చేయాలని, మనం వాళ్ళకి చేసేలా ఉండకుండా ఉంటే చాలని ఆమె పేర్కొన్నారు. అయితే ఇప్పటికే మా సంస్థ నుంచి మెంబర్ షిప్ అందడంతో ఆమెకు ప్రతి నెలా ఆరువేల రూపాయాల పెన్షన్ కూడా లభించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: