జాన్వీ కపూర్.. అతిలోక సుందరి , అందాల తార అయినటువంటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ఇక ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఈమె తండ్రి. జాన్వి కపూర్ 2018 సంవత్సరంలో విడుదలైన దఢక్ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడిన ఉత్తమ తొలి పరిచయంతో నటిగా అవార్డు పొందడంతోపాటు జీ సినిమా ఉత్తమ నటిగా అవార్డు పొందింది. తన మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను అందుకుంది జాన్వీకపూర్.

ఇక నెట్ ఫిక్స్ లో ప్రసారమైన ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో కూడా 2020 లో నటించడం జరిగింది. అయితే జాన్వీ కపూర్ మాత్రం సినీ ఇండస్ట్రీలో కథను ఎంచుకోవడంలో ఆచితూచి అడుగు వేస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని సినిమా కథలు నచ్చితేనే , అందులో ఆ పాత్రకు ఆమె కు విలువ ఉంటుంది అని తెలిస్తే, ఆమె నటించడానికి ఒప్పుకుంది. అలా ఏడాదికి ఒకటి రెండు సినిమాలను మాత్రమే నటించడానికి ముందుకు వస్తున్న జాన్వీకపూర్.

ఇకపోతే సోషల్ మీడియాకు ఎప్పుడూ దగ్గరగా ఉండే జాన్వీకపూర్ , ఇటీవల అభిమానులకు ఒక ప్రశ్న వదిలింది. అదేమిటంటే ..ఆమె రెండు ఫోజ్ లని కలిగిన ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి, ఇందులో పూ  లేదా పార్వతి మీరు ఎవరికీ అభిమానులు అంటూ అడిగింది. ఇక జాన్వీ కపూర్ కు సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ అభిమానులను ఉత్తేజ పరుస్తూ సర్ప్రైజ్ చేస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగానే ఈసారి కూడా రెండు చిత్రాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అయితే ఇది చూసిన వాళ్లంతా జాన్వీకపూర్ లో ఇలాంటి కోణాలు  కూడా ఉన్నాయా..? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.మొదటి చిత్రంలో జాన్వీ ఆధునిక దుస్తులను ధరించి, మోడ్రన్ లుక్ లో కనిపించింది. అంటే ఆమె ట్యూబ్ టాప్ తో పాటు పసుపు ఓవర్ కోట్ ను వేసుకొని , పసుపు పొట్టి చొక్కా ధరించింది. ఇక రెండవ చిత్రంలో దక్షిణ భారతదేశ సాంప్రదాయ దుస్తులలో, అరటి ఆకులో వడ్డించిన భోజనం ముందు కూర్చుని ఉన్న ఫోటోను షేర్ చేసింది ఇక ఈ ఫోటోలు చూసిన వాళ్లంతా ఆశ్చర్యానికి గురి కావడమే కాకుండా రీ పోస్టులు కూడా పెడుతున్నారు.
అంతకుముందు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరగిస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది  ఇప్పుడు ఇలా ఫోటోలను షేర్ చేసింది.ఇక తన ముందు వడ్డించిన ఆకులో  అనేక వంటకాలతో పాటు కొబ్బరి పచ్చడి,దోశ కూడా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: