వరుస సినిమాలతో దూసుకుపోతున్న
నేచురల్ స్టార్ నాని తాజాగా తన సరి కొత్త చిత్రం శ్యాం సింగ రాయ్
సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు.
టాక్సీవాలా ఫేమ్
రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా వెరైటీ చిత్రంగా తెరకెక్కింది అని అంటున్నారు. ఈ సినిమాలో
సాయి పల్లవి కృతిసనన్
హీరోయిన్ లు గా నటించగా
మడోన్నా సెబాస్టియన్ కూడా ఓ కీలకమైన
హీరోయిన్ పాత్రలో నటించింది. ఈ చిత్రం యొక్క
పోస్టర్ తోనే
నాని ఈ
సినిమా ఎంతో వెరైటీ
సినిమా అని చెప్పకనే చెప్పాడు.
ఇక
నాని హీరోగా నటించిన
టక్ జగదీశ్ సినిమా విడుదల కు సిద్ధంగా ఉన్నా థియేటర్లు ఇంకా ఓపెన్ కాకపోవడంతో సినిమాను విడుదల చేయలేదు. నిజానికి ఈ
సినిమా ను థియేటర్లలో విడుదల చేయాలా లేదా ఓ టీ టీ లలో విడుదల చేయాలా అనే అయోమయం
నిర్మాత లో ఏర్పడింది. ఓవైపు ఈ జూలై 30న కొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి కానీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న
టక్ జగదీష్ మాత్రం ఇంకా విడుదల తేదీని కూడా ఖరారు చేయలేదు. దాంతో ఈ
సినిమా ఎప్పుడు ఎక్కడ ఎలా రిలీజ్ అవుతుంది అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు
నాని అభిమానులు.
మరోవైపు ఆర్థిక ఒత్తిడి పెరిగిపోవడంతో నిర్మాతలు ఈ సినిమాను ఓ టీ టీ లో విడుదల చేయాలని డిసైడ్ అవుతున్నారట కానీ దానికి
నాని ఒప్పుకోకపోవడంతో వారు కొంత టైం ఇచ్చి చూశారట. ఇప్పుడు కూడా థియేటర్ల పరిస్థితి అయోమయంగా ఉంది.
థియేటర్ లు ఓపెన్ అయినా కూడా తమ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే లాభాలు వస్తాయో రావో అన్న అనుమానం లో ఉన్నారు నిర్మాతలు. దాంతో తమ సినిమాలను ఓ టీ టీ విడుదల చేయాలని నిర్మాతలు
నాని పై ఒత్తిడి చేస్తున్నారు . ఈరోజో రేపో దాని గురించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక
నాని తన తదుపరి చిత్రం అంటే సుందారానికి
సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.