కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళంలో వరుస ప్రయోగాత్మక సినిమాలతో మంచి ఫలితాలు అందుకుంటున్నాడు. ధనుష్ చేసిన సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అవుతున్నాయి అంటే ధనుష్ సినిమాల ప్రభావం ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. ధనుష్ నటించి హిట్ అందుకున్న అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేసిన్ హిట్ అందుకున్నారు. విక్టరీ వెంకటేష్ నారప్ప మూవీలో తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఇక ధనుష్ నటించిన మరో సూపర్ హిట్ మూవీ కర్ణన్ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

లేటెస్ట్ గా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ధనుష్ మూవీ ఒకటి ఫిక్స్ చేసుకున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ధనుష్ మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ధనుష్ హీరోగా ఒక సినిమా వస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా ధనుష్ బర్త్ డే సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ నుండి ధనుష్ కు హ్యాపీ బర్త్ డే పోస్టర్ వేశారు. అంటే ఇన్ డైరెక్ట్ గా సినిమా కన్ ఫర్మ్ అని చెప్పినట్టే. అయితే ఈ సినిమాకు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. ఆ వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగులో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న సూర్యదేవర నాగవంశీ ధనుష్ తో ఎలాంటి సినిమా చేస్తారో అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. సితార బ్యానర్ ధనుష్ మూవీ తప్పకుండా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఏమాత్రం తగ్గకుండా మరికొన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉండేలా చేస్తారని చెప్పొచ్చు.
 

 


మరింత సమాచారం తెలుసుకోండి: